Akshaya tritiya | అక్షయ తృతీయకు ముందు 3 రోజు లు.. తర్వాత 3 రోజులు బంగారం, వెండి కొనుగోళ్లకు భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఇప్పుడు కొనడం శుభప్రదం గా భావించడమే కారణం. దీంతో ఓ వారం రోజులు నగల మార్కెట్లో సందడి కనిపిస్తూనే ఉంటుంది. అయితే సంప్రదాయ కొ నుగోళ్లతోపాటు గత కొన్నేండ్లుగా పెట్టుబడి సంబంధిత లావాదేవీలు అక్షయ తృతీయ వేళ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఫలితం గా అటు ఆభరణాల అమ్మకాలు.. ఇటు బం గారం, వెండి నాణేల విక్రయాలూ సాగుతున్నాయి. దశాబ్దాలైనా వన్నె తగ్గకపోవడం.. పాతది, కొత్తది అన్న తేడా లేకుండా ప్రస్తుత మార్కెట్కు అనుగుణంగానే ధరలు పలుకడం.. సులభంగా అమ్ముకునే వీలుండ టం.. తనఖా పట్టైనా రుణాలు తీసుకునే వె సులుబాటుతో చాలామంది బంగారు నాణేలను కొనేందుకు ఇష్టపడుతున్నారిప్పుడు.
పెట్టుబడిదారులకు బంగారం అనేది ఎప్పటికీ ఓ సురక్షిత సాధనమే అని చెప్పుకోవచ్చు. అందుకే సగటు భారతీయ మధ్యతరగతి కుటుంబాలు సైతం బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే ఇలాంటి మదుపరులు.. భారత ప్రభుత్వ మింట్ సేల్స్ ఔట్లెట్ల నుంచి నాణేలను కొనుగోలు చేయవచ్చు. బహిరంగ మార్కెట్లలో ఎదురయ్యే మోసాలకు తావుండదు. అయితే మార్కెట్ తో పోల్చితే గ్రాము ధర మాత్రం కాస్త ఎక్కువే ఉంటుంది.
అర్ధ తులం నుంచి ఐదు తులాల వరకు వివిధ పరిమాణాల్లో బంగారు, వెండి నాణేలు మింట్ ఔట్లెట్లలో లభిస్తున్నాయి. నేరుగా ఔట్లెట్ల వద్దకు వెళ్లి కొనుగోలు చేయవచ్చు. లేదంటే ఆన్లైన్ ద్వారా కొనవచ్చు. ఆన్లైన్లో కొనాలనుకునేవారు www. indiagovtmint.in ను సందర్శించాలి. ఇక భౌతికంగా కొనాలనుకునేవారికి దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లోనే ఆ సౌకర్యం ఉన్నది. హైదరాబాద్తోపాటు ఢిల్లీ, నోయిడా, ముంబై, కోల్కతాల్లోనే మింట్ సేల్స్ ఔట్లెట్లు ఉన్నాయి.
011-43582256, 011-40580035
24 క్యారెట్ 10గ్రాముల బంగారు నాణెం ధర 66,878.57
10గ్రాముల వెండి నాణెం 982.35