Budget 2024-25 | ఎన్నికల ముంగిట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పన్ను చెల్లింపు దారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో వేతన జీవులు రూ.7 లక్షల్లోపు ఆదాయం గల వారు పన్ను మినహాయింపు ఉంటుందని ప్రకటించారు. ఆదాయం పన్ను శ్లాబ్ల్లో ఎటువంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు.
గత పదేండ్లలో పన్ను వసూళ్లు రెండింతలకు పైగా వసూళ్లయ్యాయని తెలిపారు. పన్ను వసూళ్లు రూ.20.02 లక్షల కోట్లకు చేరుకుంటాయని తెలిపారు. బడ్జెట్ అంచనాలకు మించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.30.03 లక్షల కోట్లకు చేరతాయని అంచనా వేశారు.