న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ప్రభుత్వరంగ సంస్థయైన బీఎస్ఎన్ఎల్ కూడా 4జీ సేవలు అందించడానికి సిద్ధమవుతున్నది. వచ్చే రెండు నెలల్లో 4జీ సేవలను ఆరంభించబోతున్నట్టు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ తెలిపారు.
తొలి దశలో మెట్రో నగరాల్లో మాత్రమే 4జీ సేవలను ప్రారంభించి..వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా ప్రారంభించాలనుకుంటున్నట్టు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్లో వెల్లడించారు. డిసెంబర్లో పంజాబ్లో 4జీ సేవలు ప్రారంభించనున్నట్టు, ఇందుకోసం ఇప్పటికే 200 సైట్లను ఏర్పాటు చేయగా, మరో 3 వేల సైట్ల ఏర్పాటునకు సంబంధించి ప్రాసెసింగ్ జరుగుతున్నట్టు ఆయన చెప్పారు.