BSNL | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 60 రోజుల కాలపరిమితితో రూ.345 ప్రీపెయిడ్ ప్లాన్ను తెచ్చింది. ఈ ప్లాన్ కింద రోజుకు 1జీబీ డాటాతోపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ను అందిస్తున్నట్లు తెలిపింది.
4జీ సేవలు అందించడానికి సిద్ధమతున్న సంస్థకు ఈ నూతన ప్లాన్తో కస్టమర్లకు అధిక ప్రయోజనాలు లభించనున్నాయని తెలిపింది. ఇతర టెలికం సంస్థల కంటే బీఎస్ఎన్ఎల్ టారిఫ్లు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి.