న్యూఢిల్లీ, నవంబర్ 11: దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్లో ఒకటైన బీఎస్ఈ నికర లాభంలో నాలుగింతలు పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను కంపెనీ నికర లాభం నాలుగింతలు పెరిగి రూ.118.4 కోట్లకు చేరుకున్నది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.29.4 కోట్లుగా నమోదైంది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదా యం ఏడాది ప్రాతిపదికన 53 శాతం ఎగబాకి రూ.240 కోట్ల నుంచి రూ.367 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. గత త్రైమాసికంలో సంస్థ రోజువారి టర్నోవర్ రూ. 5,922 కోట్లుగా నమోదైనట్టు వెల్లడించారు.