న్యూఢిల్లీ, ఆగస్టు 15: రాఘవ్ బెహల్ ప్రమోట్ చేసిన డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్ఫామ్ క్వింటిల్లన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ (క్యూబీఎంఎల్) లిమిటెడ్లో తాజాగా 51 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. బీక్యూ ప్రైమ్ పేరుతో బిజినెస్, ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ను క్వింటిల్లన్ మీడియా నిర్వహిస్తున్నది. గతంలోనే ఈ కంపెనీలో 48 శాతం వాటాను రూ.47.84 కోట్లకు కొనుగోలు చేయగా, ఇప్పుడు మిగిలిన 51 శాతం వాటాను చేజిక్కించుకుంటున్నది.
ఈ మేరకు క్వింటిల్లన్తో ఒక ఎంఓయూ కుదుర్చుకునేందుకు తమ సబ్సిడరీ ఏఎంజీ మీడియా వర్క్స్ బోర్డు ఆమోదం తెలిపినట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. వాస్తవానికి అదానీ గ్రూప్ న్యూస్ మీడియా పరిశ్రమలోకి తొలుత ప్రవేశం క్యూబీఎంఎల్ ద్వారానే. ఇందులో 49 శాతం వాటా కొన్న తర్వాత గత డిసెంబర్లో న్యూస్ టెలివిజన్ చానల్ ఎన్డీటీవీలో 65 శాతం మెజారిటీ వాటాను చేజిక్కించుకుంది.