హైదరాబాద్, డిసెంబర్ 4: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రూ.5 వేల కోట్ల నిధులను సమీకరించింది. మౌలిక సదుపాయాల కోసం, గృహ రుణాల వితరణ చేయడానికి దీర్ఘకాలిక బాండ్లను జారీ చేయడంతో ఈ భారీ స్థాయిలో నిధులను సేకరించినట్టు బ్యాంక్ పేర్కొంది. మొత్తం ఇష్యూ సైజు రూ.5 వేల కోట్లు కాగా, బిడ్డింగ్లు మాత్రం రూ.10,350 కోట్లు వచ్చాయని వెల్లడించింది. కూపన్ రేటును 7.68 శాతంగా నిర్ణయించింది. మెచ్యూరిటీ 10 ఏండ్లు. బ్యాంక్ జారీ చేసిన ఈ బాండ్లకు క్రిసిల్, ఇండియా రేటింగ్లు ఏఏఏ ఇచ్చాయి.