న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) మళ్లీ నష్టాల్లోకి జారుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సంస్థకు రూ.238.12 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టం సంభవించింది.
క్రితం ఏడాది సంస్థ రూ.12.10 కోట్ల లాభా న్ని గడించిన విషయం తెలిసిందే. అలాగే సమీక్షకాలంలో ఆదాయం రూ. 5,418.74 కోట్ల నుంచి రూ. 5,305. 38 కోట్లకు పడిపోయింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనూ నూ.343 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది.