న్యూఢిల్లీ, అక్టోబర్ 5: గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రముఖ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్..కేంద్ర ప్రభుత్వానికి రూ.88 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక చెక్కును కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండేకు భెల్ సీఎండీ నలిన్ సింఘాల్ గురువారం అందచేశారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.139 కోట్ల తుది డివిడెండ్ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంట్లో 63.17 శాతం వాటా కలిగిన కేంద్రానికి రూ.88 కోట్ల డివిడెండ్ను అందచేసింది.