న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: విద్యుత్ పరికరాల ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ భెల్ నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనూ సంస్థ రూ.148.77 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
నిర్వహణ ఖర్చులు అధికమవడం వల్లనే నష్టాలు వచ్చాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.42.28 కోట్ల లాభాన్ని ప్రకటించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.5,353.94 కోట్ల నుంచి రూ.5,599.63 కోట్లకు పెరిగినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు కూడా రూ.5,320.84 కోట్ల రూ.5,816.87 కోట్లకు పెరగడం వల్లనే నష్టాలు వచ్చాయని పేర్కొంది.