Nalin Negi | భారత్పే చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఆఫీసర్ నలిన్ నేగీ నియామకమయ్యారు. ఈ మేరకు కంపెనీ మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక సీఈవోగా పని చేస్తున్నారు. ఇంతకు ముందు సీఈవోగా పని చేసిన సుహైల్ సమీర్ జనవరి 7న సీఈవో పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పని చేస్తున్న నలిన్ నేగీకి కంపెనీ తాత్కాలిక సీఈవోగా నియమించారు. తాజాగా కంపెనీ ఆయనకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. నేగీ 2022లో భారత్పేలో చేరారు. భారత్ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ను తొలగించి తర్వాత ఉన్నత స్థాయి ఉద్యోగులు వరుసగా బాధ్యతల నుంచి వైదొలగడం, సుహైల్ సమీర్ రాజీనామా తర్వాత నేగీ తాత్కాలిక సీఈవోగా కొనసాగుతూ వస్తున్నారు. నేగీ నాయకత్వంలో భారత్పే నిర్వహణ ఆధాయం సుమారు 182శాతం పెరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.