న్యూఢిల్లీ : భారత్లోని పలు నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రావడంతో 5జీ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. 5జీ స్మార్ట్ఫోన్లకు భారీ డిమాండ్ నెలకొనడంతో మొబైల్ కంపెనీలు బడ్జెట్ ధరలో ప్రీమియం ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు సాగిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రీమియం ఫోన్లు 5జీ కనెక్టివిటీతో లభిస్తున్నా అవి రూ . 20,000కు పైగా ధర పలుకుతున్నాయి.
రూ 15,000లోపు కొన్ని 5జీ ఫోన్లు అందుబాటులో ఉండి బడ్జెట్ కస్టమర్లకు మెరుగైన ఛాయిస్గా ముందుకొస్తున్నాయి. వేగవంతమైన పనితీరు, మెరుగైన బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఆకట్టుకునే కెమెరా ఫీచర్లతో బడ్జెట్ 5జీ స్మార్ట్ఫోన్లకు ఆదరణ పెరుగుతున్నది. రూ 15,000లోపు మెరుగైన స్మార్ట్ఫోన్లు మార్కెట్లో సందడి చేస్తున్నా ఐక్యూఓఓ జడ్6లైట్, శాంసంగ్ గెలాక్సీ ఎం135జీ, రెడ్మి నోట్ 11టి 5జీ వంటి ఫోన్లను కొనుగోలు చేయవచ్చని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. రూ . 15,000లోపు లభించే మెరుగైన 5జీ స్మార్ట్ఫోన్లు ఇవే..
ఐక్యూఓఓ జడ్6 లైట్ 5జీ : రూ . 13,990
శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ : రూ . 14,299
పోకో ఎం4 5జీ : రూ. 12,999
రెడ్మి నోట్ 11టీ 5జీ : రూ. 16,999 (బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్ తర్వాత రూ. 15,000లోపు లభిస్తుంది)