KYC | ఆగస్టు నెల ముగియడానికి మరొకరోజు గడువు మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుంచి లబ్ధి పొందాలనుకుంటే ఈ నెల 31 లోపు అంటే బుధవారం అర్ధరాత్రి లోగా ఈ-కేవైసీ సబ్మిట్ చేయడం తప్పనిసరి. లేని పక్షంలో తదుపరి వాయిదా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డబ్బులు రావు. దీంతోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తమ ఖాతాదారులను కేవైసీ పత్రాలను ఈ నెల 31లోపు సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ అలా చేయకపోతే బ్యాంకు ఖాతాల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతాయి.
పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ నెల 31 లోపు ఈ-కేవైసీ పొందాలి. గడువులోగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకుంటే తదుపరి వాయిదా డబ్బులు రావు. రైతులు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. సమీప కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)ని సందర్శించి ఈ-కేవైసీ పొందొచ్చు.
అలా కానీ పక్షంలో ఇంటి వద్ద నుంచే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్లి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.
పార్మర్న్స్ కార్నర్లోకి వెళ్లి ఈ-కేవైసీ టాబ్పై క్లిక్ చేయాలి. తదుపరి దశలో మీ ఆధార్ నంబర్ నమోదు చేసిన సెర్చ్ టాబ్పై క్లిక్ చేయాలి. రైతుల మొబైల్ ఫోన్కు నాలుగు అంకెల ఓటీపీ లభిస్తుంది. ఓటీపీ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు ఈ-కేవైసీ పూర్తవుతుంది.
ఈ నెల 31 లోపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఖాతాదారులు కేవైసీ సబ్మిట్ చేయాలి. ఒకవేళ, అలా చేయకపోతే సంబంధిత ఖాతా మూసివేస్తారు. పీఎన్బీ వెబ్సైట్ ప్రకారం కేవైసీ సబ్మిషన్ పెండింగ్లో ఉంటే వెంనే పూర్తి చేసేయాలి. లేని పక్షంలో ఖాతా నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంతకుముందు గత మార్చి 31 వరకు కేవైసీ పత్రాలు సబ్మిట్ చేయడానికి పీఎన్బీ అనుమతించింది. చేయని వారికి సమస్యలు తలెత్తలేదు. ఈ నెల 31 లోపు కేవైసీ దాఖలు చేయకుంటే సమస్యలు తలెత్తాయి. ఖాతాదారులు బ్యాంకుకెళ్లి కేవైసీ ఫామ్ పూర్తించి.. దాంతోపాటు సంబంధిత పత్రాలు సమర్పించాలి. ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ పూర్తి చేసేవారు రిజిస్టర్డ్ ఈ-మెయిల్ నుంచి మీ పత్రాలను బ్యాంకుకు పంపాల్సి ఉంటుంది.