BJP | హైదరాబాద్, జూన్ 22 (స్పెషల్ టాస్క్ బ్యూరో- నమస్తే తెలంగాణ): కార్పొరేట్ మిత్రులకు చెందిన లక్షల కోట్ల రూపాయల రుణాలను రైటాఫ్ చేస్తూ బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూలే దుస్థితికి తీసుకొచ్చిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. అత్యున్నత పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులను నీరుగార్చే కుట్రకు తెరతీసింది.
దేశంలోని మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6 బ్యాంకులకు గత కొన్నేండ్లుగా చైర్పర్సన్లు లేనేలేరు. ఈ జాబితాలో యూకో, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.