న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.1,218 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.840 కోట్లతో పోలిస్తే 45 శాతం వృద్ధిని కనబరిచింది.
బ్యాంక్ ఆదాయం ఈసారి రూ.6,488 కోట్లకు ఎగబాకింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.88 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 0.20 శాతానికి తగ్గింది. మరోవైపు, రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.1.40 లేదా 14 శాతం డివిడెండ్ను బోర్డు ప్రతిపాదించింది.