ముంబై, మార్చి 19: బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఎం) గృహ రుణాలపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రుణాలపై వడ్డీరేటు 8.45 శాతం నుంచి 8.30 శాతానికి తగ్గాయి. ఈ ప్రత్యేక ఆఫర్లు ఈ నెల చివరి వరకు మాత్రమే అమలులో ఉండనున్నాయని పేర్కొంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజును కూడా బ్యాంక్ పూర్తిగా ఎత్తివేసింది.
గృహ రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లలో ఇదే తక్కువది కావడం విశేషం.30 ఏండ్ల కాలపరిమితితో గృహ రుణాలపై 8.3 శాతం వడ్డీ ప్రాతిపదికన రూపాయలు లక్షపై నెలకు ఈఎంఐ రూ.755 కానున్నది. మరోవైపు, రూఫ్టాప్ సొలార్ ప్యానెల్లపై కూడా 7 శాతం వార్షిక వడ్డీకి రుణాలను ఆఫర్ చేస్తున్నది బీవోఎం..ప్రాసెసింగ్ ఫీజును ఎత్తివేసింది. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 95 శాతం రుణంగా మంజూరు చేయనున్నది బ్యాంక్. ఈ రుణాన్ని 120 నెలల్లో తిరిగి చెల్లింపులు జరపవచ్చును.