న్యూఢిల్లీ: బీవోబీ లాభాలు రెండింతలు పెరిగాయి. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,197 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,061 కోట్లతో పోలిస్తే ఇది రెండు రెట్లు పెరిగింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ. 20, 482.26 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. స్థూల నిరర్థక ఆస్తుల విలువ గత త్రైమాసికానికిగాను 7.25 శాతానికి దిగొచ్చింది. అలాగే నికర ఎన్పీఏ కూడా 2.39శాతం నుంచి 2.25 శాతానికి తగ్గింది.