న్యూఢిల్లీ, జనవరి 22: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్..అయోధ్యను సందర్శించేవారికి ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్ని రూట్ల నుంచి అయోధ్యకు విమాన టికెట్ ధరను రూ.1,622గా నిర్ణయించింది. ఈ నెల 28 లోపు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు సెప్టెంబర్ 30 లోగా ప్రయణించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ప్రత్యేక ఆఫర్ ఎంపిక చేసిన దేశీయ రూట్లకు మాత్రమే వర్తించనున్నదని, డైరెక్ట్ వన్-వే ఫ్లైట్స్కు పనిచేయనున్నదని తెలిపింది. లిమిటెడ్ సీట్లు మాత్రమే ఉన్నాయని, ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి లభించనున్నాయని పేర్కొంది. గ్రూపు బుకింగ్లు, ప్రత్యేక బుకింగ్లకు ఈ ఆఫర్ వర్తించనున్నది. మరోవైపు, వచ్చే నెల 1 నుంచి అయోధ్యకు చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్, పాట్నాల నుంచి విమాన సర్వీసులను ఆరంభించబోతున్నది.