హైదరాబాద్, ఏప్రిల్ 8 ( నమస్తే తెలంగాణ ): ఉత్తమ ప్రతిభ కనబర్చిన సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల యజమాన్యాలకు అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానించింది కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ. సేవల, తయారీ రంగంలో వేరు వేరుగా అవార్డులను అందించనున్నారు. ఎంపికైన వాటికి నగదు బహుమతులను అందించనున్నట్లుగా ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ అడిషనల్ డెవలప్మెంట్ కమీషనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఈనెల 20లోగా ఆన్లైన్లో https:// dashboard. msme.gov.in/na లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.