గ్రేటర్ నోయిడా, జనవరి 11: వాహన పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదానం వేదికగా ‘ఆటో ఎక్స్పో 2023’ అట్టహాసంగా ఆరంభమైంది. తొలి రెండు రోజులు ఆటోమొబైల్ సంస్థలు తమ వాహనాలను ప్రదర్శించండగా..ఆ తర్వాత ఐదు రోజుల పాటు సందర్శకులకు అనుమతించనున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ ఆటో ఎక్స్పోలో దేశీయ, అంతర్జాతీయ వాహన సంస్థలు తమ వాహనాలు కొలువుదీరాయి.
2022లో జరుగాల్సి ఉండగా..కరోనాతో వాయిదాపడింది. ఈ షోలో అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాలు దర్శనమిచ్చాయి. సుజుకీ మోటర్ కార్పొరేషన్ తన కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఈవీఎక్స్’ను ప్రదర్శించింది. 2025 నాటికి దేశీయ మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్న ఈ కారు సింగిల్ చార్జింగ్తో 550 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. అలాగే మారుతి సుజుకీ 16 వాహనాలను ప్రదర్శించింది. ఈ షోకు మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఫోక్స్వ్యాగన్, నిస్సాన్లతోపాటు లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెజ్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీలు పాల్గొనడం లేదు. మొత్తంగా ఈ షోలో 75 వాహనాలు ప్రదర్శించనున్నారు.
గ్రీవ్స్ కాటన్స్
విద్యుత్తో నడిచే ద్వి, త్రిచక్ర వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది గ్రేవ్స్ కాటన్స్
ఎంజీ మోటర్
దేశీయ మార్కెట్లోకి ‘ఎంజీ4 ఈవీ’ మాడల్ను విడుదల చేస్తున్న ఎంజీ మోటర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబా. దీంతోపాటు రూ.14.72 లక్షల నుంచి రూ.22.42 లక్షల లోపు ధర కలిగిన నూతన జనరేషన్ హెక్టార్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హ్యుందాయ్
హ్యుందాయ్కు చెందిన ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘అయోనిక్ 5’ మాడల్తో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్. ఢిల్లీ షోరూంలో ఈ కారు ధరను రూ.44.95 లక్షలుగా నిర్ణయించింది.
బీవైడీ
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ సీల్ మాడల్తో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్. సింగిల్ చార్జింగ్లో 700 కిలోమీటర్లు ప్రయాణించనున్నది ఈ మాడల్.
కియా
కియా కాన్సెప్ట్ ఎస్యూవీ ‘ఈవీ9’ మాడల్ను మార్కెట్లోకి విడుదల చేస్తున్న కంపెనీ ఎండీ తయా-జిన్ పార్క్, ఇతర ఉన్నతాధికారులు. దేశీయ ఈవీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వచ్చే నాలుగేండ్లలో రూ.2 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించింది.
టాటా
టాటా మోటర్స్ 20 రకాల ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను ప్రదర్శిస్తున్నది. అందులో ఎలక్ట్రిక్ ఎస్యూవీ సియెర్రా ప్రత్యేకం. 2025లో దీన్ని మార్కెట్కు పరిచయం చేయాలని సంస్థ భావిస్తున్నది.
మారుతి
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ తన కాన్సెప్ట్ కారు ‘ఈవీఎక్స్’ మాడల్ను ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది.
ఆటో ఎక్స్పోలో ఎస్ఆర్250 బైక్తో కీవే ఇండియా చైర్మన్ వికాస్ ఝబఖ్