హైదరాబాద్, నవంబర్ 9: అరబిందో ఫార్మా అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను కంపెనీ రూ.757 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.409.4 కోట్ల లాభంతో పోలిస్తే 85 శాతం వృద్ధిని కనబరిచింది.
కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికి 25.7 శాతం అధికమై రూ. 7,219.4 కోట్లకు చేరుకున్నది. మరోవైపు, రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.3 లేదా 300 శాతం తొలి మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది సంస్థ.