ముంబై, ఆగస్టు 18: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఈవీ మాడళ్లను పరిచయం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని నెలల్లోనే భారత్లో విడుదల చేయడం విశేషం. నాలుగు రకాల్లో లభించనున్న ఈ మాడళ్లలో 50 ఈ-ట్రాన్ ధరను రూ.1.13 కోట్లు, స్పోర్ట్బ్యాక్ 55 ఈ-ట్రాన్ రూ.1.18 కోట్లు, 55 ఈ-ట్రాన్ ధర రూ.1.26 కోట్లు, స్పోర్ట్బ్యాక్ 55 ఈ-ట్రాన్ ధరను రూ.1.30 కోట్లుగా నిర్ణయించింది.
ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధించినవి. వీటిలో స్పోర్ట్బ్యాక్ 55 ఈ-ట్రాన్ మాడల్ సింగిల్ చార్జింగ్తో 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చునని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అలాగే 50 ఈ-ట్రాన్, స్పోర్ట్బ్యాక్ 50 ఈ-ట్రాన్ మాడళ్లు 505 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నది.