న్యూఢిల్లీ : లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి భారత్ మార్కెట్లో ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ కూపే సెడాన్ను లాంఛ్ చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు బుకింగ్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ మోడల్ను పోర్షే తొలి ఎలక్ట్రిక్ కారు సాంకేతిక జోడింపుతో ఆడి డెవలప్ చేసింది. ఇక ఈ-ట్రాన్ జీటీ కారు ధర రూ 1.8 కోట్లు కాగా, ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ కూపే ధర రూ 2.05 కోట్లని ఆడి వెల్లడించింది.
స్పోర్టింగ్ ఫీచర్తో ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లను రూపొందించినా అగ్రెసివ్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్తో కూడిన ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్ల్యాంప్లు మోడ్రన్ లుక్ తీసుకువచ్చాయి. మెరుగైన ఏరోడైనమిక్స్తో పలు డిజైన్ ఎలిమెంట్స్ ఆడి ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీల ప్రత్యేకతగా కంపెనీ చెబుతోంది. స్టాండర్డ్ మోడల్కు భిన్నంగా ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ మెరుగైన సామర్ధ్యం కోసం కార్బన్ ఫైబర్ రూఫ్ను కలిగిఉంది.
ఎంఎంఐ ఇంటర్ఫేస్తో 10 ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచ్ వర్చువల్ కాక్పిట్, ఆటోమేటిక్ ఏసీ, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం, పానోరమిక్ సన్రూఫ్, యాంబియంట్ లైటింగ్, హీటెడ్ ఓఆర్వీఎం, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్, ఫ్రంట్, సైడ్ ఎయిర్బ్యాగ్లతో పాటు ట్రాక్షన్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరాతో కూడిన పార్కింగ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అత్యాధునిక ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి.