న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. జల విద్యుత్తోపాటు వివిధ మార్గాల్లో 100 గిగావాట్ల ఇంధన ఉత్పత్తి సామర్థ్యాని సంపాదించుకున్నది. దీంతో సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నాలుగో స్థానంలో నిలిచిందని కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది.
పునరుత్పాదక విద్యుత్ రంగంలో నాలుగో స్థానంలో, సౌర విద్యుత్ రంగంలో ఐదో ర్యాంక్, పవన విద్యుత్ రంగంలో నాలుగో స్థానంలో నిలిచిందని కేంద్ర విద్యుత్శాఖ వెల్లడించింది.
100 గిగావాట్ల సామర్థ్యం గల ఉత్పాదక కేంద్రాల స్థాపన పూర్తయింది. ఇంకా 50 గిగావాట్లు ఇన్స్టలేషన్, 27 గిగావాట్ల సామర్థ్యం గల కేంద్రాలు టెండర్ల ప్రక్రియ పరిధిలో ఉన్నాయి. 2030 నాటికి 450 గిగావాట్ల సంప్రదాయ ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని విద్యుత్ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది.