న్యూఢిల్లీ : ఆన్లైన్ గేమింగ్పై (Online Gaming) 28 శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై టెక్ ఎంట్రప్రెన్యూర్, భారత్ పే సహ వ్యవస్ధాపకులు అష్నీర్ గ్రోవర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్లైన్ గేమ్స్పై జీఎస్టీలో అత్యధిక పన్ను శ్లాబ్ను విధించడం ద్వారా ఈ చర్య దేశంలో ఎదుగుతున్న గేమింగ్ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని గ్రోవర్ ట్వీట్ చేశారు. తమ గొంతును బలంగా వినిపించేందుకు టెక్ స్టార్టప్ వ్యవస్ధాపకులు రాజకీయాల్లోకి రావాలని ఆయనపిలుపు ఇచ్చారు.
ఫాంటసీ క్రికెట్ మొబైల్ గేమ్ క్రిక్పే స్టార్టప్ను ఇటీవల గ్రోవర్ ప్రారంభించిన క్రమంలో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంపై గ్రోవర్ మండిపడ్డారు.భారత్లో రియల్ మనీ గేమింగ్ ఇండస్ట్రీకి ఆర్ఐపీ అంటూ గ్రోవర్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రజలు రూ. 72 పాట్ ఎంట్రీపై రూ. 100 పెడతారని ప్రభుత్వం అనుకుంటోందని, (28 శాతం జీఎస్టీ) వారు ప్లాట్ఫాం ఫీజు అనంతరం రూ. 54 గెలుచుకుంటే దానిపై 30 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. స్టార్టప్ ఫౌండర్లు రాజకీయాల్లోకి వచ్చి తమ గొంతును బలంగా వినిపించాల్సిన అవసరం ఉందని గ్రోవర్ పిలుపు ఇచ్చారు.
ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని క్రిక్పే ఫౌండర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆన్లైన్ గేమింగ్ విషయంలో మొత్తం లావాదేవీ విలువపై నూతన పన్ను రేటును వర్తింపచేస్తారు. ఈ నిర్ణయం డ్రీమ్ 11, ఎంపీఎల్, గేమ్స్క్రాఫ్ట్, గేమ్స్ 24×7 సహా పలు గేమింగ్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆన్లైన్ స్కిల్ గేమ్స్పై జీఎస్టీని 18 నుంచి 28 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని గ్రోవర్తో పాటు భారత్లో అతిపెద్ద ఆన్లైన్ గేమింగ్ కంపెనీ ll ఇండియా గేమింగ్ ఫెడరేషన్, ఈ-గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) సైతం ఆన్లైన్ గేమ్స్పై పన్ను రేటును పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.
Read More :