AI | ఆర్టిఫిషియల్ టెక్నాలజీ పలు రంగాలపై పెను ప్రభావం చూపుతోంది. 2022లో ఓపెన్ఏఐ చాట్జీపీటీతో ముందుకొచ్చిన అనంతరం ఇంటరాక్టివ్ జనరేటివ్ ఏఐ టూల్స్పై హాట్ డిబేట్ సాగుతోంది. చాట్జీపీటీకి యూజర్ల నుంచి విశేష ఆదరణ లభించిన క్రమంలో పలు టెక్ దిగ్గజాలు సొంతంగా తమ ఏఐ చాట్బాట్స్ను లాంఛ్ చేశాయి. మరోవైపు లేటెస్ట్ టెక్నాలజీతో కొలువుల కోత తప్పదనే ఆందోళన తీవ్రతరమవుతోంది.
తమ అనుమతి లేకుండానే ఓపెన్ఏఐ తన ఎల్ఎల్ఎంలకు శిక్షణ ఇచ్చేందుకు తమ బుక్స్ను వాడుతోందని ఆరోపిస్తూ కొద్దినెలల కిందట వందలాది రచయితలు టెక్ కంపెనీకి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే తరహాలో జొనాస్ బ్రదర్స్ సహా 200 మందికిపైగా మ్యూజీషియన్లు ఏఐకి వ్యతిరేకంగా గళం విప్పారు. తమ హక్కులను ఉల్లంఘించే పద్ధతులను నిలిపివేయాలని కోరుతూ ఏఐ కంపెనీలకు బహిరంగ లేఖ రాశారు.
ఈ లేఖపై జొనాస్ సోదరులు, బిల్లీ ఇలిష్, క్యాటీ పెర్రీ, స్మోకీ రాబిన్సన్ వంటి ప్రముఖ ఆర్టిస్ట్లు సంతకాలు చేశారు. మ్యూజిక్ పరిశ్రమలో ఏఐ వినియోగంతో తలెత్తే దుష్ప్రభావాలపై ఈ లేఖలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగంతో సృజనాత్మకత దెబ్బతింటుందని, ఆర్టిస్టులు, హక్కుదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఏఐ డెవలపర్లు, టెక్నాలజీ కంపెనీలు, డిజిటల్ వేదికలకు వారు విజ్ఞప్తి చేశారు. ఆర్టిస్ట్స్ రైట్స్ అలయన్స్ ఆధ్వర్యంలో వీరు ఏఐ కంపెనీలకు తమ సమస్యలను నివేదిస్తూ బహిరంగ లేఖ రాశారు.
Read More :
Sushil Modi | గత 6 నెలలుగా క్యాన్సర్తో పోరాడుతున్నాను.. సుశీల్ మోదీ సంచలన ప్రకటన