EPFO | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) వడ్డీరేటును 8.15 శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించడం ఆలస్యం.. బీజేపీ పరీవారమంతా సోషల్మీడియాలో పబ్లిసిటీకి తెరతీసింది. ఉద్యోగుల బాగు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు పోస్టుల పరంపర కొనసాగించింది. అయితే, 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి గడిచిన తొమ్మిదేండ్లలో బీజేపీ ప్రభుత్వం ఈపీఎఫ్వో వడ్డీరేటును నిజానికి తగ్గించింది.
2014-15లో ఈపీఎఫ్వో వడ్డీరేటు 8.75 శాతంగా ఉండగా, తాజా పెంపుతో ఇప్పుడది 8.15 శాతానికి చేరింది. ఈ లెక్కన కేంద్రం వడ్డీరేటును 0.60 శాతం తగ్గించినట్టు లెక్క. ఈ విషయాన్ని దాచిపెట్టి.. తామేదో గొప్ప పని వెలగబెట్టినట్టు బీజేపీ నేతలు గప్పాలకు పోవడం విడ్డూరంగా ఉన్నది.