న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఇండియా బ్లాక్బస్టర్ వ్యాల్యూ డేస్ సేల్ ఏప్రిల్ 14 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 17 వరకూ లైవ్లో ఉండే ఈ సేల్లో స్మార్ట్ఫోన్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, గ్రాసరీ, ఫ్యాషన్, బ్యూటీ ప్రోడక్ట్స్, గృహోపకరణాలు, టీవీలు వంటి పలు ప్రోడక్ట్స్పై ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
వీ గార్డ్, బోట్, శాంసంగ్, వన్ప్లస్, లైజాల్, ఎల్జీ అప్లయన్సెస్, జవేరి పెరల్స్ వంటి ఎన్నో బ్రాండ్లు భారీ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై కస్టమర్లు పది శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ను పొందే అవకాశం ఉంది. ఎల్జీ 0.8 టన్ 3 స్టార్ ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అమెజాన్పై కేవలం రూ. 29,999కే లభిస్తోంది.
ఎల్జీ 242 ఎల్3 స్టార్ స్మార్ట్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, సింఫనీ ఐస్ క్యూబ్ 27 పర్సనల్ ఎయిర్ కూలర్తో పాటు ఫాస్ట్రాక్ రిఫ్లెక్ట్ వీఓఎక్స్, ఫైర్బో్ల్ట్ గ్లాడియేటర్ వంటి స్మార్ట్వాచ్లు భారీ డిస్కౌంట్తో తగ్గింపు ధరలకు అమెజాన్ సేల్లో అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం13తో పాటు వివో సహా పలు స్మార్ట్ఫోన్లపై కూడా భారీ ఆఫర్లు లభిస్తున్నాయి.
Read More