Xiaomi | దేశీయ మార్కెట్లోకి చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ ఇండియా (Xiaomi India) గురువారం పలు ఉత్పత్తులను తీసుకొచ్చింది. ఇందుకోసం ‘స్మార్ట్ లివింగ్ 2023’ అనే పేరుతో ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వివిధ సైజుల్లో 2 టు 4-కే ఎక్స్ సిరీస్ స్మార్ట్టీవీలు, వాక్యూమ్ రోబోట్, రెండు ఎయిర్ ప్యూరిఫయ్యర్లు, ట్రిమ్మర్ తదితర ఉత్పత్తులు ఆవిష్కరించింది. ఈ నెల 19 నుంచి ఎంఐ డాట్ కామ్, ఫ్లిప్కార్ట్, ఇతర ఆఫ్లైన్ స్టోర్లలో వీటి సేల్స్ మొదలవుతాయి.
స్మార్ట్ ఫోన్లతోపాటు స్మార్ట్ టీవీ మార్కెట్లో తనకంటే స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న షియోమీ.. తాజాగా ఎక్స్ సిరీస్లో సరికొత్త స్మార్ట్ టీవీ తెచ్చింది. షియోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ప్రో (Xiaomi SmartTV XPro) పేరిట కొత్త టీవీ ఆవిష్కరించింది. ఈ టీవీని 43, 50, 55 ఇంచుల పరిమాణంలో తెచ్చింది. ఈ ఎక్స్పో షియోమీ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ ఓఎస్తో పనిచేస్తుంది. ఈ టీవీలో 2-4కే రిజొల్యూషన్తోపాటు డాల్బీ విజన్ ఐక్యూ, వివిధ్ పిక్చర్ ఇంజిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డీటీఎస్, డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్లతోపాటు 40 వాట్ల సౌండ్ సిస్టమ్ జత చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ లివ్ వంటి ఓటీటీ యాప్స్కు ఈ టీవీ సపోర్ట్గా ఉంటుంది.
43-అంగుళాల టీవీ ధర రూ.32,999,
50-అంగుళాల టీవీ ధర రూ.41,999,
55 అంగుళాల టీవీ ధర రూ.47,999
కొత్తగా స్మార్ట్ ఎయిర్ ప్యూరీఫయర్-4, స్మార్ట్ ఎయిర్ ప్యూరీ ఫయర్ 4-లైట్ పేరిట షియోమీ రెండు ప్యూరిఫయర్లను ఆవిష్కరించింది. విశాలమైన ఇండ్లు, పెద్ద పెద్ద రూమ్ గల ఇండ్లకు స్మార్ట్ ప్యూరిఫయర్-4 సరిపోతుందని తెలిపింది. దీనికి 360-డిగ్రీలు, 3 లేయర్ల ఫిల్టరేషన్ సిస్టమ్ ఉందని షియోమీ తెలిపింది. ఈ ప్యూరిఫయర్లను షియోమీ హోం యాప్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సాతో కనెక్ట్ కావచ్చు. ఈ ప్యూరిఫయర్లు తక్కువ శబ్దంతో పని చేస్తాయి. ఓఎల్ఈడీ స్క్రీన్ ద్వారా మోడ్, ఇండికేటర్లను తెలుసుకునే వీలు ఉంది.
ఎయిర్ ప్యూరిఫయర్-4 రూ.13,999లకు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్తో కొనుగోలు చేస్తే రూ.13,249లకే అందుబాటులో ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫయర్-4 లైట్ ధర రూ.9999గా నిర్ణయించగా, బ్యాంక్ ఆఫర్పై రూ.9,499లకు అందుబాటులో ఉంటుంది. ఈ నెల 23 నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.
ఇంటిని క్లీన్ చేయడానికి షియోమీ రోబోట్ వాక్యూమ్-మాప్2ఐ ఆవిష్కరించింది. జైరో స్కోప్, ఆప్టికల్ సెన్సర్ వంటి ఫీచర్లను అమర్చడంతో ఇల్లు నలుమూలల క్లీన్ చేయడానికి వీలవుతుందని షియోమీ తెలిపింది. ఇందులో గల బ్యాటరీ 1200 చదరపు అడుగుల ఇంటిని క్లీన్ చేయడానికి 100 నిమిషాలు పడుతుంది. దీని ధర రూ.16,999 గా నిర్ణయించింది. ఈ నెల 28 నుంచి అమెజాన్లో సేల్స్ మొదలవుతాయి. ఇక బెర్డ్ ట్రిమ్మర్-2సీ పేరుతో కొత్త ట్రిమ్మర్ను షియోమీ తీసుకొచ్చింది. దీని ధర రూ.1,199గా నిర్ణయించింది.