నారాయణపేట టౌన్, మార్చి 23 : విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యవంతమైన ఎదుగుదల ఉం టుందని అంగన్వాడీ టీచర్లు భాగ్యలక్ష్మి, శైలజ, వరలక్ష్మి అన్నారు. పట్టణంలోని 4వ వార్డు 1, 2, 3 అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో వివేకానంద ఉన్నత పాఠశాలలో మంగళవారం పోషణ పక్షోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి రోజు పోషక విలువలు కలిగిన కూరగాయలు, ఆకుకూరలు, గు డ్లు, పప్పు దినుసులు ఆహారంగా తీసుకోవాలన్నారు. అ నంతరం విద్యార్థులచే పోషణ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆయాలు పాల్గొన్నారు.
పోషణ పక్వాడా
దామరగిద్ద, మార్చి 23 : విద్యార్థులు పౌష్టికాహారం తీ సుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. మండలంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పోషణ పక్వా డా కార్యక్రమాన్ని నిర్వహించారు. కిశోరబాల, బాలికలకు పోషక ఆహారం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. అదేవిధంగా కానుకుర్తిలో అంగన్వాడీ కార్యకర్తలు పోషణ పక్వాడా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వా డీ వసంత, ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఎంపీటీసీ బస్వరాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పౌష్టికాహారంపై సైకిల్ ర్యాలీ
ధన్వాడ, మార్చి 23 : విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్లు అన్నారు. పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలో అంగన్వాడీల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు విటమిన్లు, పోషక పదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల సరైన ఎదుగుదలతోపాటు జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. అదేవిధంగా బాలికలకు రక్తహీనత గురించి వివరించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.
పోష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
కోస్గి, మార్చి 23 : పోష్టికాహారం అందిస్తేనే పిల్లలు సం పూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అన్నపూర్ణ అన్నారు. మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో అంగన్వాడీ కేంద్రంలో 5, 8 కేంద్రాల చిన్నారు లు, బాలింతలు, గర్భిణులకు పోషణ పక్షోత్సవాల్లో భా గంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ గర్భిణులు పోషక పదార్థాలతో కూడిన ఆహారం తీసుకుంటేనే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు సూచించిన వి ధంగా పోషక ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, కిశోర బాలికలు, చి న్నారులు, బాలింతలు, గర్భిణులు పాల్గొన్నారు.