బెంగళూరు, డిసెంబర్ 7: ఆన్లైన్లో దుస్తులను విక్రయిస్తున్న ఆజియో తాజాగా ‘బిగ్ బోల్డ్ సేల్’ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 50 శాతం నుంచి 90 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. 19 వేలకు పైగా పిన్ కోడ్లో ఉన్న కస్టమర్లు 5,500కి పైగా బ్రాండ్లకు సంబంధించిన ఉత్పత్తులను ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది. ఈ ఆఫర్లలో భాగంగా బుకింగ్ చేసుకున్నవారికి ప్రతి ఎనిమిది గంటలకొకసారి ఐఫోన్ 14 ప్రొ, యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్, సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 4, సామ్సంగ్ ఎస్23 అల్ట్రాను గెలుచుకోవచ్చునని కంపెనీ సీఈవో వినీత్ నాయర్ తెలిపారు.