న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,607 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.283.5 కోట్ల లాభంతో పోలిస్తే ఐదు రెట్లు పెరిగినట్లు తెలిపింది.
2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.26,854 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.32,805 కోట్లకు పెరిగింది. ఆదాయంలో 22 శాతం పెరుగుదల కనిపించింది. దీంట్లో మొబైల్ సేవలు అందించడంతో రూ.18,220 కోట్లు సమకూరాయి.