న్యూఢిల్లీ, నవంబర్ 2: భారతీ ఎయిర్టెల్ 5జీ కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. 5జీ సేవలు ఆరంభించిన 30 రోజుల్లోనే 10 లక్షలకు వినియోగదారులు చేరినట్లు కంపెనీ సీటీవో రణదీప్ సెఖాన్ తెలిపారు. కాగా, ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే 5జీ సేవలు ప్రారంభించినట్లు, దశలవారీగా దేశవ్యాప్తంగా అందించాలనుకుంటున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. 4జీ ధరలకే 5జీ సేవలు అందిస్తున్నట్లు, వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు ధరలు పెంచే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు.