హైదరాబాద్, మార్చి 6: ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్..రాష్ట్రంలో మరో మూడు నగరాలకు తన 5జీ సేవలను విస్తరించింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో 5జీ సేవలను ప్రారంభించిన సంస్థ.. తాజా గా నిజామాబాద్, ఖమ్మం, రామగుండంలో కూడా ఈ సేవలను ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలో తన 5జీ సేవల నగరాల సంఖ్య ఆరుకి పెంచుకున్నది. దేశవ్యాప్తంగా సోమవారం ఒకేరోజు 125 నగరాల్లో ఈ సేవలను ప్రారంభించిన సంస్థ..అటు ఏపీల్లోనూ 13 నగరాలకు విస్తరించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందించాలనే లక్ష్యంతో మరిన్ని నగరాలకు ఈ సేవలు విస్తరించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.