న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: హైదరాబాద్లోని బేగంపేటలో విమానాల రిపేర్ల కేంద్రాన్ని ప్రైవేటు రంగం ఏర్పాటుచేయనున్నది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెందిన ఈ ఎయిర్పోర్టుతోసహా దేశంలోని 8 ఎయిర్పోర్టుల్లో ఇటువంటి కేందాల్ని నెలకొల్పనున్నట్లు పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. పౌర విమానయాన రంగంలో మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షించేదిశగా మెయింటేనెన్స్, రిపైర్, ఓవర్హౌల్ (ఎంఆర్వో) సర్వీసుల కోసం మంత్రి బుధవారం కొత్త విధానాన్ని ప్రకటించారు. ఈ విధానంలో ఒపెన్ టెండర్ల ద్వారా స్థలాన్ని లీజుకివ్వడం, ఏఏఐ వసూలుచేసే రాయల్టీని రద్దుచేయడం వంటి అంశాలున్నాయి. ఇండియాను ‘గ్లోబల్ ఎంఆర్వో హబ్’గా రూపొందించేందుకు ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. ఎంఆర్వో కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడుల్ని ఆకర్షించగల 8 ఎయిర్పోర్టులను మంత్రిత్వ శాఖ గుర్తించింది. అవి..బేగంపేట, భోపాల్, చెన్నై, చండీఘర్, ఢిల్లీ, జుహు, కొల్కతా, తిరుపతి. మంత్రి ప్రకటించిన విధానంలో ముఖ్యాంశాలు ఇవీ..