Air India new class | అంతర్జాతీయ విమానాల్లో కొత్తగా ప్రీమియం ఎకానమీ క్లాసును ఎయిరిండియా ప్రవేశపెట్టనున్నది. ఈ విషయాన్ని ఎయిరిండియా చీఫ్ క్యాంప్బెల్ విల్సన్ వెల్లడించారు. వచ్చే నెలలో ఈ కొత్త ఎకానమీ క్లాస్ అందుబాటులోకి రానున్నది. కొన్ని సుదూర అంతర్జాతీయ విమానాల్లో ఈ ప్రీమియం ఎకానమీ క్లాస్ను ప్రవేశపెట్టనున్నారు. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్లైన్ తన మార్కెట్ వాటాతో పాటు గ్లోబల్ నెట్వర్క్ను విస్తరించే మార్గాలపై కృషి చేస్తున్నదని విల్సన్ పేర్కొన్నారు.
జేఆర్డీ టాటా మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో క్యాంప్బెల్ విల్సన్ ప్రసంగించారు. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఎయిర్లైన్ తన మార్కెట్ వాటాను కనీసం 30 శాతానికి పెంచుకుంటున్నదని చెప్పారు. ఎయిర్లైన్ దీర్ఘకాలిక పునరుద్ధరణ ప్రణాళికను అమలు చేస్తున్నదన్న ఆయన.. రాబోయే ఐదేండ్లలో వైడ్-బాడీ, నారో బాడీ ఫ్లీట్ను పెంచడంతోపాటు గ్లోబల్ నెట్వర్క్ను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విడిభాగాలు, డబ్బు కొరత కారణంగా సంవత్సరాలుగా నిలిచిపోయిన దాదాపు 20 విమానాలను ఎయిర్లైన్ పునరుద్ధరించినట్లు చెప్పారు.