Air India | న్యూఢిల్లీ, మార్చి 15: టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఉద్యోగులకు షాకిచ్చింది. 180 మంది నాన్-ఫ్లైయింగ్ సిబ్బందిని తొలగించినట్లు ప్రకటించింది. సంస్థ ఇటీవల ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం(వీఆర్ఎస్), పునరుద్దరణ అవకాశాలు ఎంచుకోకపోవడం వల్లనే వీరిపై వేటు వేసినట్లు కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. ఎయిర్ ఇండియాలో 18 వేల మంది సిబ్బంది ఉన్నారు.