న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో కొలువుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతుండగా, ఉద్యోగాలను న్యూ టెక్నాలజీ రీప్లేస్ చేయదని, ఇది వృత్తుల్లో, వివిధ రంగాల్లో విభిన్న పార్స్వాలను ఆవిష్కరిస్తుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఆటోమేషన్ ఎనీవేర్ నిర్వహించిన ఇమేజిన్ 2023లో ఏఐ రాక, ఉద్యోగాలపై ప్రభావానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
గతంలో ఏఐతో కొలువుల కోత అనివార్యమని టెక్ దిగ్గజాలు పేర్కొనగా అందుకు భిన్నంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఉత్పాదకత మెరుగవుతుందని, వర్క్ ఫ్లో పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. కార్మికులు, ఉద్యోగుల పనితీరును ఏఐ మెరుగుపరుస్తుందని, వారిని రీప్లేస్ చేయబోదని పేర్కొన్నారు. గత ఏడాది చాట్జీపీటీ, మిడ్జర్నీల రాకతో పోటీ ప్రపంచంలో నిలబడేందుకు పలు కంపెనీలు ఏఐ టూల్స్ను ప్రవేశపెట్టడం, న్యూ టెక్నాలజీని అందుపుచ్చుకోవడం కోసం పోటీపడ్డాయి.
ఈ క్రమంలో కొన్ని కేసుల్లో ఉత్పాదక పెరగ్గా మరికొన్ని ఉదంతాల్లో పలువురు ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోయారు. ఇక న్యూ టెక్నాలజీ సర్ధుబాటు అవుతున్న కొద్దీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం నుంచి ఉద్యోగుల నైపుణ్యాలకు పదును పెట్టేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఏఐ నైపుణ్యాలను సిబ్బంది అందిపుచ్చుకునేలా కంపెనీలు చొరవ చూపుతున్నాయి. ఏఐ ప్రయోజనాలను అందిపుచ్చుకుంటూనే ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరిచేలా చర్యలు చేపడుతుండటంతో కొలువుల కోత ముప్పు తప్పుతోంది.
Read More :
Lucifer 2 | లూసిఫర్ సీక్వెల్ షూటింగ్ మొదలు.. ఈ సారి మరింత పొలిటికల్ టచ్..!