హైదరాబాద్, ఆగస్టు 18: కృత్రిమ మేధ (ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, ఏఐ)పై హైదరాబాద్లో ఒక ల్యాబ్ ఏర్పాటుచేసేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్, హనీవెల్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ (హెచ్టీఎస్)లు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ల్యాబ్లో ఇరు సంస్థలూ కృత్రిమ మేధపైన, నూతన టెక్నాలజీలపైన పరిశోధన చేస్తాయి. ఈ ల్యాబ్ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం ప్రారంభించారు. ల్యాబ్ను ఐఐటీ నిర్వహిస్తుంది. ఇరు సంస్థలూ కలిసి ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులకు శిక్షణ, వర్క్షాప్లు నిర్వహించనున్నాయి.