హైదరాబాద్, నవంబర్ 19: యూరప్లో ఉక్రెయిన్-రష్యా యుద్దంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు తలెత్తాయని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కొవిడ్-19 మూడోవేవ్ నుంచి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తేరుకున్న సమయంలోనే హఠాత్తుగా ప్రపంచానికి తీవ్ర ఆహార, ఇంధన సంక్షోభం మొదలయ్యిందన్నారు. శనివారం హైదరాబాద్లో ఆర్బీఐ ఎకనామిక్, పాలసీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ వార్షిక సదస్సులో దాస్ మాట్లాడుతూ కొవిడ్ పాండమిక్ సంక్షోభంతో ఇంటి నుంచి పనిచేయడం ద్వారా డైరెక్ట్ ఫీడ్బ్యాక్ మెకానిజమ్ను, సాఫ్ట్వేర్ డెలివరీ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసే అవకాశం కలిగిందన్నారు. మరోవైపు పాండమిక్తో ఏర్పడిన డిమాండ్, సరఫరా షాక్లతో ద్రవ్య విధాన రూపకల్పనకు సవాళ్లు ఎదురయ్యాయన్నారు. ఏ తరహా ఆర్థిక ఉద్దీపనలను ఇవ్వాలి, అవి ఏ మేరకు పనిచేస్తాయి అనే అంశాల్ని కొత్తగా విశ్లేషించాల్సి వచ్చిందన్నారు. తగిన ద్రవ్య విధానాన్ని, ఉద్దీపనను రూపొందించడానికి కొవిడ్ తొలివేవ్లో గణాంకాల సమీకరించడం ప్రధాన సవాలుగా పరిణమించిందని, తీవ్రమైన రెండో వేవ్లో ఆయా రంగాల ఒత్తిడిపై సమాచారాన్ని సేకరించడం క్లిష్టమయ్యిందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. అటుతర్వాత యుద్దం తెచ్చిపెట్టిన కొత్త సవాళ్లను ప్రస్తావించారు. అవి..