AI : ఏఐతో కొలువుల కోత తప్పదనే ఆందోళనల నడుమ అడోబ్ ఇండియా డైరెక్టర్ వేణుగోపాలన్ లేటెస్ట్ టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏఐ విస్తరించి, మానవుల పురోగతికి దారితీస్తుందని పేర్కొన్నారు. ఏఐతో ఎక్కువ మంది జాబ్ మార్కెట్లోకి రాగలుగుతారు.. ఇది సృజనాత్మకత ప్రజాస్వామీకరణకు దారితీస్తుందని అన్నారు.
అదే సమయంలో ఏఐతో పని నాణ్యతను పెంపొందించడానికి నిపుణులకు వెసులుబాటు ఉంటుందని వేణుగోపాలన్ చెప్పారు. ఏఐని అర్థం చేసుకోవడం, దాన్ని స్వీకరించడం కీలకమని చెప్పారు. తద్వారా ఇది భవిష్యత్తులో వేగంగా ముందుకు సాగడానికి మిమ్మల్ని అనుమతిస్తుందని వేణుగోపాలన్ పేర్కొన్నారు.
ఇక ఏఐ రాకతో ఉద్యోగులపై వేటు తప్పదని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐతో కోడర్స్ ఉద్యోగాలు కనుమరుగవుతాయని ఎన్విడియా సీఈవో హ్యవాంగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు టెకీల్లో గుబులు రేపాయి. ఇక ఏఐతో భారత్లో ఐటీ కంపెనీల రిక్రూట్మెంట్ 70 శాతం తగ్గుతుందని హెచ్సీఎల్ మాజీ సీఈవో పేర్కొన్నారు.
Read More :
Indian Citizenship | గుజరాత్లో 18 మంది పాక్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం