న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఈ నెల 20 నుంచి మరో 24 రూట్లకు విమాన సేవలు ఆరంభించబోతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వీటిలో రెండు కొత్త రూట్లతోపాటు ఢిల్లీ నుంచి ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్తోపాటు ముంబై నుంచి హైదరాబాద్, చెన్నై రూట్లలో అదనపు సర్వీసులు కూడా ఉన్నట్లు పేర్కొంది.
ఈ రూట్లలో ప్రయాణీకులు అధికంగా ఉండటంతో సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం 54 విమానాలతో సేవలు అందిస్తున్నట్లు, వచ్చే ఏడాదిలోగా మరో 16 సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.