Gautam Adani | ఆసియా కుబేరుడు గౌతం అంబానీ.. తన వ్యాపార లావాదేవీల పర్యవేక్షణకు విదేశాల్లో ఫ్యామిలీ ఆఫీస్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారని సమాచారం. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ.. దుబాయ్లో గానీ, న్యూయార్క్లో గానీ ఆఫీసు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఆఫీసు నిర్మాణానికి అదానీ ఫ్యామిలీ నిధులు ఖర్చు చేస్తారని పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తులు చెప్పారు. ఫ్యామిలీ ఆఫీస్ మేనేజర్ల కోసం ప్రత్యేకంగా ఫుల్ షూట్ను అద్దెకు తీసుకునే అంశాన్ని అదానీ గ్రూప్ వ్యవస్థాపకులు పరిశీలిస్తున్నారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అదానీ వ్యక్తిగత సంపద ఈ ఏడాది 58 బిలియన్ డాలర్లకు పెరిగిన నేపథ్యంలో దుబాయ్ లేదా న్యూయార్క్లో సంస్థ ఆఫీసు ఏర్పాటు చేయనుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది.
భారత్లో సంప్రదాయ రంగాలపై పట్టు సాధించడంతోపాటు విదేశాల్లోనూ వివిధ కంపెనీలను అదానీ గ్రూప్ టేకోవర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా సంస్థ లావాదేవీలను విస్తరించే లక్ష్యంతో గౌతం అదానీ ముందుకు సాగుతున్నది.
ఒకవేళ అదానీ వ్యక్తిగత నికర సంపద 135 బిలియన్ డాలర్లకు పెరిగితే ఆల్ట్రారిచ్ ఫ్యామిలీస్లో ఒకటిగా ఆయన కుటుంబం చేరనున్నది. అదే జరిగితే తమ ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత పెట్టుబడులు, దాతృత్వ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఫ్యామిలీ ఆఫీసులను విదేశాల్లో ఏర్పాటు చేయాలని గౌతం అదానీ భావిస్తున్నట్లు సమాచారం.
హెడ్జ్ ఫండ్ బిలియనీర్లు రేడాలియో, గూగుల్ కో-ఫౌండర్ సెర్జెయి బ్రిన్ కూడా సింగపూర్లో ఫ్యామిలీ ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు. ముకేశ్ అంబానీతోపాటు గౌతం అదానీ కూడా సింగపూర్లో ఫ్యామిలీ ఆఫీసు ప్రారంభిస్తారని గత నెలలో బ్లూంబర్గ్ న్యూస్ పేర్కొంది. ఈ అంశంపై స్పందించడానికి అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి నిరాకరించారు.