చెన్నై : తమిళనాడులో అదానీ గ్రూప్ (Adani Group) భారీ పెట్టుబడులు పెట్టనుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024లో రూ. 42,700 కోట్ల పెట్టుబడులతో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ ఒప్పందాలపై సంతకాలు చేసింది. రానున్న 5-7 ఏండ్లలో అదానీ గ్రీన్ ఎనర్జీ మూడు పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులను రూ. 24,500 కోట్లతో చేపట్టనుంది.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా, అదానీ పోర్ట్స్, ఎస్ఈజడ్ ఎండీ కరణ్ అదానీల సమక్షంలో ఒప్పందంపై అదానీ గ్రూప్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇక అదానీ కానెక్స్ రూ. 13,200 కోట్లతో రాష్ట్రంఓ హైపర్స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుండగా, అంబుజా సిమెంట్స్ రూ. 3500 కోట్లతో మూడు సిమెంట్ గ్రైండింగ్ యూనిట్స్ను నెలకొల్పనుంది.
తమిళనాడు సుస్ధిర, పారిశ్రామిక ఎకో సిస్టమ్ను అనుసరించడంతో పాటు ఆధునిక మౌలిక వసతులు, కనెక్టివిటీని కలిగిఉందని, తమిళనాడు సామాజికార్ధిక పవర్హౌస్గా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతోందని కరణ్ అదానీ పేర్కొన్నారు.
Read More :