న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: హిండెన్బర్గ్ దెబ్బకు అదానీ గ్రూపునకు చెందిన సంస్థలతోపాటు ప్రభుత్వరంగ బ్యాంకు లు కూడా సతమతమవుతున్నాయి. గడిచిన నెల రోజుల్లో అదానీ గ్రూపునకు చెందిన షేర్లు 80 శాతం వరకు నష్టపోగా..ప్రధాన ఐదు బ్యాంకులు 20 శాతం వరకు తమ మార్కెట్ వాటాను కోల్పోయాయి. గత రెండేండ్లుగా నిరర్థక ఆస్తులతో నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వరంగ బ్యాంకులు గత రెండు త్రైమాసికాలుగానే లాభాల్లోకి వచ్చాయి.