Rs.2000 Note | ముంబై, మార్చి 1: చలామణీలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో 97.62 శాతం తిరిగి బ్యాంకుల్లో జమయ్యాయని రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఈ నోటును ఉపసంహరించుకొని తొమ్మిది నెలలు అయినప్పటికీ ఇంకా ప్రజల వద్ద రూ.8,470 కోట్ల విలువైన 2 వేల నోట్లు ఉన్నాయని పేర్కొంది.
గతేడాది మే 19న ఈ నోట్ను రిజర్వుబ్యాంక్ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఉపసంహరించుకున్నప్పుడు మార్కెట్లో రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉండగా..ప్రస్తుతం ఇవి రూ. 8,470 కోట్లకు తగ్గాయని సెంట్రల్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. వీటిలో 97.62 శాతం నోట్లు తిరిగి బ్యాంకుల్లో జమయ్యాయని, ఫిబ్రవరి 29, 2024 నాటికి ఇంకా రూ.8,470 కోట్ల విలువైన నోట్లు జమకాలేదని ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.