న్యూఢిల్లీ, జనవరి 5: జాబ్ మార్కెట్ కోలుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుత 2024 సంవత్సరంలో దేశీయంగా నియామకాలు 8.3 శాతం పెరుగుతాయని ఫౌండిట్ యాన్యువల్ ట్రెండ్స్ తాజా రిపోర్ట్లో తెలిపింది. 2023లో నియామకాలు 2022తో పోలిస్తే 5 శాతం క్షీణించగా, చివరిన్లైనా డిసెంబర్లో మాత్రం 2 శాతం వృద్ధిచెందాయి. ప్రస్తుత ఏడాది తయారీ, బీఎఫ్ఎస్ఐ, ఆటోమోటివ్, రిటైల్, ట్రావెల్, టూరిజంతో సహా కీలక రంగాల్లో నియామకాల వృద్ధి ఉంటుందని ఫౌండిట్ వివరించింది. కొన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి కన్పిస్తున్నదని, ముఖ్యంగా షిప్పింగ్ పరిశ్రమలో నియామకాలు 28 శాతం పెరిగాయన్నది. రిటైల్, ట్రావెల్, టూరిజం రంగా ల్లో 25 శాతం, అడ్వర్టైజింగ్, మార్కెట్ రీసెర్చ్, పబ్లిక్ రిలేషన్స్ రంగంలో 18 శాతం చొప్పున నియామకాలు అధికమయ్యాయని వివరించింది. ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు జాప్యం కావచ్చని, అయితే ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్, డాటా సైన్స్, సైబర్సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.