(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ధరల మంటతో కుదేలవుతున్న సామాన్యులకు మరో పిడుగులాంటి వార్త. రానున్న రోజుల్లో పాలు, తృణ ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ధరలు మరింత పెరగవచ్చని కేంద్ర ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. పశువుల దాణా ఖర్చులతోపాటు చైనాలో కొవిడ్ కేసుల పెరుగుదల వల్ల సైప్లె చైన్కు విఘాతం కలగడం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, ఆహారోత్పత్తిపై వాతావరణ ప్రభావం తదితర అంశాలు ధరల పెరుగుదలకు దారితీయవచ్చని పేర్కొన్నది.
8 ఏండ్లలో 62% పెరిగిన ఖర్చు
బీజేపీ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం నియంత్రణ తప్పడంతో 2014 నుంచి ఇప్పటివరకూ నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 300% పెరిగాయి. ఎక్సైజ్ పన్నును డీజిల్పై 512%, పెట్రోల్పై 194%, వంటగ్యాస్ ధరను 185% పెంచడంతో ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో వ్యవసాయ పెట్టుబడి పెరిగింది. రవాణా చార్జీలు, ఉత్పాదక ఖర్చులు కూడా పెరుగడంతో వాటి ప్రభావం పాలు, గోధుమ పిండి, ఉప్పు, చక్కెర, బియ్యం, నూనె తదితర నిత్యావసర వస్తువులపై పడింది. ఫలితంగా ముగ్గురు సభ్యులున్న కుటుంబానికయ్యే రోజువారీ ఖర్చు గత 8 ఏండ్లలో ఏకంగా 62% పెరిగింది.