న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఎట్టకేలకు దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెల 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంఎస్)లో ఈ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ‘దేశీయ డిజిటల్ రంగంలో కొత్త శకం ఆరంభం కాబోతున్నది. అక్టోబర్ 1 నుంచి 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి’ అని మోదీ ట్విట్ చేశారు. కానీ, ఇండస్ట్రీ వర్గాలు మాత్రం 5జీ సేవలు అందించడానికి ఇంకా మేము సిద్ధం కాలేదని, నూతన టెక్నాలజీ సేవలు అందించడానికి మరికొంత సమయం పట్టవచ్చని వ్యాఖ్యానించాయి. టెలికం మంత్రిత్వ శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ వచ్చే నెల 1 నుంచి 4 వరకు ఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరగనున్నది. ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాత్రం. వచ్చే నెల 12 నుంచి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఇన్స్టాలేషన్ పూర్తయ్యాయని, టెలికం సంస్థలు 5జీ సేవలు అందించడంలో పూర్తిగా నిమగ్నమైనట్లు చెప్పారు.
తొలుత ఏయే
నగరాల్లో హైదరాబాద్తోపాటు అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్నగర్, కోల్కతా, లక్నో, ముంబై, పుణె
వేగం
4జీ సేవల కంటే 10 రెట్లు అధికంగా డౌన్లోడ్ కానున్నది.
ఏయే కంపెనీలు
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా
టారిఫ్ రేట్లు
ప్రస్తుతం ఉన్న టారిఫ్ ధరల కంటే కొత్త ప్లాన్లు అధికంగా ఉండనున్నాయి. ఎంతమేర అధికంగా ఉండేదానిపై సంస్థలు స్పష్టతనివ్వలేదు.