హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ఫోన్ వినియోగదారుల అభిరుచి సైతం మారిపోతున్నది. మోడల్, ఫీచర్స్, ఇంటర్నల్ హార్డ్వేర్లో ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం 4జీ కాలం నడుస్తున్నది. రాబోయే ఒకటి రెండేండ్లలో 5జీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది ఈ నేపథ్యంలో కొత్తగా ఫోన్ కొనాలనుకునేవారు 5జీ కిసైతం సపోర్ట్ చేసే మోడళ్లు కావాలని కోరుకుంటున్నారట. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ మొబైల్ సర్వే’ పేరుతో వేల మంది వినియోగదారులతో చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.